అభిమానం ముగ్గేసింది..! అలరిస్తున్న కేసీఆర్ రంగోళి
జనగామ : సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలను అభిమానించే వారికి లెక్కే ఉండదు. కొందరికి సినీ హీరోహీరోయిన్లు నచ్చితే కొందరికి కమెడియన్లు నచ్చుతారు. అదే కోవలో పొలిటికల్ లీడర్లకు ఉండే క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు. ప్రచార సభలు, రోడ్ షో లు చూస్తే ఆ విషయం బోధపడుతుంది. అయితే తమ అభిమాన నటీనటులు, నేతల కోసం ఫ్యాన్స్ అప్పుడప్పుడూ కొత్త తరహా క్రియెటివిటీ చూపిస్తారు. ఆ క్రమంలో ఓ మహిళ సీఎం కేసీఆర్ పై అభిమానం చాటుతూ వేసిన రంగోళి ఆకట్టుకుంటోంది.
కారెక్కనున్న టీడీపీ సీనియర్..! మండవ ఇంటికి కేసీఆర్.. కూతురు గెలుపు కోసమేనా?
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెద్ది కుసుమ అనే మహిళ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలో కేసీఆర్ రంగోళిని చూడముచ్చటగా వేశారు. "కాబోయే దేశ ప్రధాని".. "రైతుకు కన్నీరు లేకుండా చేయడమే లక్ష్యం" అనే కొటేషన్ తో వేసిన రంగోళి పలువురిని అలరిస్తోంది. భారతదేశం మ్యాపులో కేసీఆర్ నాగలి భుజానికెత్తుకున్నట్లుగా అందంగా తీర్చిదిద్దారు. ఆ నోట ఈ నోట విషయం కాస్తా తెలియడంతో కుసుమ ఇంటికి క్యూ కట్టారు జనాలు. కేసీఆర్ రంగోళిని చూస్తూ బాగుందంటూ ఆమెను అభినందిస్తున్నారు.