కేంద్రమే రాష్ట్రానికి బాకీ : సీఎం కేసీఆర్
వరంగల్ కేంద్రంగా తెలంగాణ సీఎమ్ కేసిఆర్ మరోసారి బీజేపీ,కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. 70 సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని ఆధోగతి చేసిన పార్టీలు ఘనత రెండు పార్టీలదని వీవ్రంగా మండిపడ్డారు.ఇక రాష్ట్రం నుండి కేంద్రానికి లక్ష కోట్ల రుపాయాలు వెళ్తుంటే రాష్ట్రానికి మాత్రం రూ 25 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగాంగా వరంగల్ ఆజాంజాహీ మిల్లు గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రధానంగా పన్నుల రూపంలో తెలంగాణ నుండి ఢిల్లికి లక్ష కోట్ల రుపాయల పన్నులు వెళుతున్నాయని కాని రాష్ట్రానికి మాత్రం కేవలం 25 వేల కోట్ల రుపాయలు మాత్రమే వస్తున్నాయని అన్నారు.దీంతో పాటు దేశంలో కాంగ్రెస్ ,భాజపాయోతర కూటమే అధికారంలోకి రానుందని పలు చానేళ్లు చెబుతున్నాయని అన్నారు. ఈనేపథ్యంలోనే 16 ఎంపీలు గెలిస్తే దేశాన్ని మార్చే రాజకీయాలు చేయవచ్చని అన్నారు. ఇక గడచిన 70 ఏళ్లలో దేశంలోని ఉన్న సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. గతంలో చెప్పినట్టుగానే 70వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని అన్నారు. ఈనేపథ్యంలోనే తనకు ప్రధాని కావాలనే కోరిక మాత్రం లేదని స్పష్టం చేశారు. ప్రధాని ఎవరున్నా ప్రజల సమస్యలు తీర్చాలన్నదే తన లక్ష్యమని అన్నారు.