టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత: అవయవదానం
ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆయన భౌతికకాయాన్ని కాస్సేపట్లో ఏలూరులోని మాగంటి నివాసానికి తరలిస్తారు. అనంతరం స్వగ్రామం చాటపర్రులో అంత్యక్రియలను నిర్వహిస్తారు. రాంజీ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Recommended Video
లోకేష్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక వినపడదు.మాగంటి రాంజీ మనకి దూరం అయిపోయాడు.తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడా నీ మరణం పార్టీకీ,నాకూ తీరని లోటు. (1/2) pic.twitter.com/u7GCze3W45
— Lokesh Nara (@naralokesh) March 7, 2021
ఈ నెల 3వ తేదీన రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఇదివరకు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. గుండెపోటుకు గురయ్యారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆయనను విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో డిశ్చార్జి చేశారు. ఏలూరుకు వెళ్లిన తరువాత మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో అక్కడే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఏలూరుకు తరలిస్తారు. అనంతరం చాటపర్రులో అంత్యక్రియలను నిర్వహిస్తారని ఏలూరు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
DONATING ALL THE VIABLE ORGANS AND GIVING A NEW LIFE TO MANY ❤️Last rites will be performed at our hometown Chataparru tomorrow..We urge you all to stay away from any misleading/unverified/false news..Please honour the fallen Tdp soldier,brother @Maganti_Ramji 💛😓 pic.twitter.com/qA5Ome8XIr
— VGS1100 (@VgowthamS) March 7, 2021
రాంజీ మరణవార్త తెలుగుదేశం పార్టీలో విషాదాన్ని నింపింది. యువనేత ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతోన్న ఆయన అకాల మరణానికి గురి కావడం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని అవినాష్ సహా పలువురు సంతాపం తెలిపారు. అన్నా అని పిలిచే ఆ పిలుపు ఇక వినపడదంటూ నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడి మరణం పార్టీకీ, తనకు తీరని లోటు అని పేర్కొన్నారు.
సోదర సమానుడు ,ఆత్మీయుడు శ్రీ మాగంటి రాంజీ గారి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు.మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.#magantiramji pic.twitter.com/FMMO54pOBk
— Devineni Avinash (@DevineniAvi) March 7, 2021