బ్రిటన్ లో తెలుగు గ్రంధాలయం
బ్రిటన్ లోని మిల్టన్ కీనెస్ సెంట్రల్ లైబ్రరీలో మార్చి 23 సాయంత్రం తెలుగు పుస్తక విభాగం ప్రారంభమైంది. దీనిని మిల్టన్ కీనెస్ నగర్ మేయర్ జాన్ లాయ్డ్ ప్రారంభించారు. ఒక భారతీయ భాషా పుస్తక విభాగం విదేశీ గ్రంధాలయాల్లో ప్రారంభం కావడం గొప్ప విశేషమే. ఈ విషయంలో ఎంకెటిఎస్ కమిటీ చేసిన కృషి ప్రశంసనీయం. ఈ గ్రంధాలయంలో తెలుగు విభాగానికి పుస్తకాలు పంపించవలసిందిగా ఈ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని మిల్టన్ కీన్స్ తెలుగు సంఘం తరఫున శ్రీధర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విధాన మండలి అధ్యక్షులు డాక్టర్ ఎ.చక్రపాణి, ప్రభుత్వ గ్రంధాలయాల డైరెక్టర్ శ్రీమతి ఎస్ వెంకమ్మ తెలుగు పుస్తకాలు కొన్ని ఇక్కడికి రావడానికి సహకరించారు. బ్రిటన్ లోని ఈ తెలుగు గ్రంధాలయ విభాగం 300 తెలుగు కుటుంబాలకు సహాయకారిగా ఉంది. తెలుగు భాషా సంస్కృతులను పరాయి గడ్డ మీద కూడా పరిరక్షించుకోడానికి ఇదొక సదుపాయం. బ్రిటన్ లో బహుశా ప్రపంచంలో ఇదే తొలి ప్రవాస తెలుగు గ్రంధాలయం కావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications