వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు సాహిత్య సదస్సు

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
ఇండియానా పోలీస్‌: తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌టెక్సాస్‌, తెలుగు సాహిత్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యసదస్సు, 'నెలనెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం జరిగాయి. స్థానిక ఓమ్నిఫోర్ట్‌ వర్త్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖకథా రచయిత కేతువిశ్వనాథరెడ్డి, దాదాపు 100మంది సాహితీప్రియులు పాల్గొన్నారు.

మందపాటి సత్యం త్రిపురనేని గోపీచంద్‌ రచనల గురించి, చంద్రహాస్‌ ముద్దుకూరి, వంగూరి చిట్టెన్‌రాజు శ్రీశ్రీ కవిత్వంపై ప్రసంగించారు. డాక్టర్‌ గన్నవరపు నరసింహమూర్తి శ్రీశ్రీమీద రాసిన సిరిసిరి మువ్వ పద్యాలను వినిపించారు.

శ్రీశ్రీ రచించిన 'సిప్రాలి' శతక పద్య పుస్తకాన్ని, అమెరికా తెలుగు పుస్తక సమాఖ్యని వంగూరి ఫౌండేషన్‌ నిర్వాహకులు కేతువిశ్వనాథరెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. జంపాల చౌదరి 'తెలుగుకథలో పరిణామం' అనే అంశంపై, డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి 'భారతీయ సంస్కృతిపై-వేద సాహిత్యం' అనే అంశంపై ప్రసాద్‌ తుర్లపాటి 'ఆంధ్రశతక సాహిత్యం - మావన వనరుల నిర్వాహణ' పై ప్రసంగించారు. తోటకూర ప్రసాద్‌, టాంటెక్స్‌ అధ్యక్షులు శ్రీధర్‌ కొర్సపాటి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X