చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రిటన్ వీసాలకు వారం రోజులు సెలవు

By Santaram
|
Google Oneindia TeluguNews

Britain
చెన్నై: యునైటెడ్ కింగ్ డమ్ వెళ్ళేందుకు ఇచ్చే వీసా దరఖాస్తు కేంద్రాలను ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు మూసివేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని యుకె వీసా దరఖాస్తు కేంద్రాల్లోని కంప్యూటర్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆధునికీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చెన్నై, హైదరాబాద్, కోచి, బెంగళూరులలోని యుకె వీసా దరఖాస్తు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకూ మూసి ఉంచుతారు.

అన్ని బ్రిటిష్ హైకమిషన్లు, రాయబార కార్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం చేయడంలో భాగంగా దక్షిణ భారత దేశంలోని వీసా దరఖాస్తు కేంద్రాలను మూసివేస్తున్నట్లు చెన్నైలోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ తన ప్రకటనలో వివరించింది. ఈ కేంద్రాలు మళ్ళీ ఏప్రిల్ 6వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తాయి.

ఏప్రిల్ నెలలో యునైటెడ్ కింగ్ డమ్ సందర్శించాలనుకునే వారు తమ తమ వీసా దరఖాస్తులను హైదరాబాద్, కోచి, బెంగళూరు కేంద్రాల్లో మార్చి 30వ తేదీలోగా, చెన్నై కేంద్రంలో 31 లోగా సమర్పించుకోవాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ స్పష్టం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X