వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్పెక్ట్రమ్ పై ఎన్నారైల లేఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అమెరికాలోని ఎన్నారైలు పెద్ద యెత్తున ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖలు రాస్తున్నారు, ఇ - మెయిల్స్ పంపుతున్నారు. సన్నీవాలె, లాస్ ఎంజెలెస్, సాన్ డీగో, హూస్టన్, చికాగో వంటి ప్రాంతాల నుంచి ఎన్నారైలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అవినీతికి వ్యరేకతంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో ఎన్నారైలకు చెందిన పీపుల్ ఫర్ లోకసత్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో పోయిన డబ్బును తిరిగి రాబట్టాలని, అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పీపుల్ ఫర్ లోకసత్తా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది.

2జి స్పెక్ట్రమ్ లో నష్టపోయిన 46 బిలియన్ డాలర్ల మొత్తం చిన్నదేమీ కాదని, 30 లక్షల పాఠశాల భవనాలు నిర్మించవచ్చునని లేదా వేయి నాగార్జున సాగర్ ఆనకట్టలను నిర్మించవచ్చునని లేదా 2.5 మిలియన్ కొత్త నర్సింగ్ హోమ్ లను పెట్టవచ్చునని సన్నీవాలె లో ఉద్యమాన్ని నడిపిస్తున్న రవీంద్ర నందం అన్నారు. లాస్ ఎంజెల్స్ లో ప్రధానికి లేఖలు రాయడానికి ఎన్నారైలను సమీకరించిన వర్మ దంతలూరి రాజీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంభకోణం తీరుపై దినేష్ పగడాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లైసెన్సులను రద్దు చేయడం ద్వారా, విండ్ ఫాల్ టాక్స్ లు వేయడం ద్వారా దేశాన్ని మోసం చేసే వారు సామాజిక, రాజకీయ హోదాను కోల్పోవడమే కాకుండా దివాళా తీస్తారనే సందేశం ఇవ్వాలని హూస్టన్ లోని ఎన్నారై హైమా సాగి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X