వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపి ఆఫీసులపై దాడికి ఎన్నారైలు ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తెలంగాణ ప్రాంతంలో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలోని లోకసత్తా కార్యాలయాలపై తెలంగాణలో దాడులు జరగడాన్ని పీపుల్ ఫర్ లోకసత్తా ఖండించింది. వివిధ దేశాలకు చెందిన ఎన్జీవో సంస్థ పీపుల్ ఫర్ లోకసత్తా. శాసనసభలో జయప్రకాష్ నారాయణ చేసిన ప్రకటనలోని విషయాలను పక్కన పెడితే పార్టీ కార్యాలయాలపై దాడి చేయడం సరి కాదనేది తమ భావన అని పీపుల్ ఫర్ లోకసత్తా అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి సరి కాదనేది తమ ఉద్దేశమని ఓ ప్రకటనలో తెలిపింది.

నేరాలకు సంబంధం లేని కార్యకలాపాలను క్షమించాలని జెపి స్వయంగా చెప్పారని, అది సరిపోదని అన్ని గ్రూపులు భావిస్తున్నాయని, చట్ట పరిధిలో వారికి ఏదైనా అడగడానికి హక్కు ఉంటుందని తెలిపింది. చట్టాన్ని అతిక్రమిస్తూ క్షమించాలని కోరడం వైరుధ్యంతో కూడిందని వ్యాఖ్యానించింది. జయప్రకాష్ నారాయణ ప్రకటనను తాము పూర్తిగా బలపరుస్తున్నట్లు తెలిపింది. ప్రజలను బెదిరిస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం సహించరానిదని వ్యాఖ్యానించింది. రాజకీయాలు మతం, కులం, ప్రాంతం ఆధారంగా నడవకూడదని తమ భావన అని తెలిపింది. కొంత మంది బంధుప్రీతి, వారసత్వం, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులూ శక్తి ద్వారా రాజకీయాలు నడవకూడదని తమ అభిప్రాయమని చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X