వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూజెర్సీకి టిటిడి ఉత్సవమూర్తులు
హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో తితిదే ఉత్సవ మూర్తులకు శనివారం చక్రస్నానం జరగనుంది. ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించనున్న స్వామి వారి కల్యాణ వేడుకలను పురస్కరించుకొని 40 మంది ఆలయ పురోహితులు ఉత్సవమూర్తులతో మంగళవారం తిరుపతి నుంచి బయల్దేరారు. వీరు 19న హరిద్వార్ చేరుకుంటారు. 20న శ్రీవారికి గంగాజలాలతో చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు ఢిల్లీ చేరుకుంటారు. 21 సాయంత్రం ఢిల్లీలోని వేంకటేశ్వర కళాశాల ప్రాంగణంలో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు.
Comments
Story first published: Thursday, March 18, 2010, 11:38 [IST]