వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీకి టిటిడి ఉత్సవమూర్తులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
మే మొదటి వారంలో న్యూజెర్సీలో నిర్వహించనున్న వేంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకకు తితిదే ప్రత్యేకంగా ఉత్సవమూర్తుల విగ్రహాల రూపకల్పన చేపట్టింది. ఆగమశాస్త్రం ప్రకారం తితిదే ఉత్సవ విగ్రహాలను సముద్రాలు దాటించకూడదు. ఈ విషయం వివాదాస్పదమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీకి తీసుకెళ్లేందుకే తితిదే విగ్రహాల తయారీ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉత్సవమూర్తుల్లాగే 3.5 అడుగుల ఎత్తుతో వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిల పంచలోహ విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తితిదే ధర్మప్రచార పరిషత్‌ ఉప సంచాలకుడు రాళ్లబండి కవితా ప్రసాద్‌ బుధవారమిక్కడ తెలిపారు.

హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో తితిదే ఉత్సవ మూర్తులకు శనివారం చక్రస్నానం జరగనుంది. ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించనున్న స్వామి వారి కల్యాణ వేడుకలను పురస్కరించుకొని 40 మంది ఆలయ పురోహితులు ఉత్సవమూర్తులతో మంగళవారం తిరుపతి నుంచి బయల్దేరారు. వీరు 19న హరిద్వార్‌ చేరుకుంటారు. 20న శ్రీవారికి గంగాజలాలతో చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు ఢిల్లీ చేరుకుంటారు. 21 సాయంత్రం ఢిల్లీలోని వేంకటేశ్వర కళాశాల ప్రాంగణంలో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X