వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యలను కాపాడబోయి ఇద్దరు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
ఆస్ట్రేలియాలో ప్రమాదం నుంచి తమ భార్యలను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు తెలుగు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పెర్త్‌ లో గల పెంగ్విన్ ఐలండ్ నుంచి ప్రమాదకరమైన శాండ్‌ బార్‌ ను దాటే సమయంలో ఈ ఘోరం జరిగింది. జలక్రీడలాడుతూ నీళ్లలో మునిగిపోతున్న తమ భార్యలను పైకి లాగబోతూ పవన్ ఘనశాల, ప్రవీణ్ శ్రీకాంత్ అనే ఇద్దరూ ప్రాణత్యాగం చేశారు. వీరిద్దరూ మునిగిపోయే సమయానికి అక్కడున్న రేంజర్లు అసలు శాండ్‌బార్ ప్రాంతానికి ఎవరినీ వెళ్లకుండా నిరోధించే ప్రయత్నంలో ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. లోతైన జలాల్లో వాళ్లు కొట్టుకుపోతుండగా కాపాడే ప్రయత్నాలు జరిగినా, అవి ఫలించలేదు.

బాయిలర్ తయారీ పరిశ్రమలో పనిచేసే పవన్ ఇటీవలే ఆస్ట్రేలియాకు కుటుంబంతో సహా వచ్చారు. ఆ దంపతులకు రోహిత్ (8), నీహార్ (7) అనే ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లకింకా తమ తండ్రి మరణవార్త తెలియదు. వీరు నదిని దాటేటప్పుడు వీరితో పాటు ఉన్న ఇద్దరి భార్యలతో పాటు మరో ఇద్దరిని సమీపంలో ఉన్న రాకింగ్‌హామ్, ఫ్రెమాంట్లె ఆస్పత్రులకు తరలించారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులతో కలిసి వీరంతా అక్కడున్న దీవిలోకి పిక్నిక్ కోసం వచ్చారు. మిగిలినవాళ్లంతా ఒక ఫెర్రీలో ఒడ్డు కు చేరుకున్నారు. అక్కడి నుంచే ఆ విషాద దృశ్యాన్ని కళ్లారా చూసి విలపించారు. మధ్యా హ్నం పూట బలమైన గాలులు వీస్తుండటం వల్ల ఈ ప్రాంతంలో జలక్రీడలకు ప్రజలను ఇన్నాళ్లుగా అనుమతించట్లేదు. తాము ఎంతగా హెచ్చరించినా ప్రజలు వెళ్తూనే ఉన్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ కన్జర్వేషన్‌కు చెందిన మైనెమా తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X