హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లండన్‌లో హైదరాబాదీ సజీవ దహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Suneel Kumar
లండన్‌లో హైదరాబాదుకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఉద్యోగం కోసం లండన్‌ వెళ్లిన సునీల్‌కుమార్‌(28) అతని ఇంటి యజమాని, కుమారుల మధ్య జరిగిన వివాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివసిస్తున్న కె.బాబూరావు, శోభారాణిలకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు సునీల్‌కుమార్‌(28) ఎంబీఏ-హెచ్‌ఆర్‌ పూర్తి చేసి 2009లో లండన్‌కు వెళ్లాడు. అక్కడ ఒక సంస్థలోని సేల్స్‌ విభాగంలో కొంత కాలం పనిచేశాడు. నాలుగు నెలల క్రితం వర్చువల్‌ ఇంటర్నల్‌ యూకే లిమిటెడ్‌ అనే సంస్థలో అకౌంట్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది.

కొద్ది రోజుల క్రితం సునీల్‌ లండన్‌లోని బౌల్‌కౌర్‌ స్ట్రీట్‌లో నివసించే ఓ సర్దార్‌ ఇంట్లో అద్దెకి దిగాడు. ఇదే అతని పాలిట మృత్యు శాపమైంది. ఆదివారం రాత్రి ఇంటి యజమాని, అతని కుమారుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన కుమారుడు ఇంటికి నిప్పుపెట్టగా యజమానితోపాటు సునీల్‌కుమార్‌ కూడా సజీవ దహనమయ్యాడు. లండన్‌లోనే నివసిస్తున్న సునీల్‌ బంధువులు బుధవారం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు.

English summary
A Hyderabad youth dead in london. He went to London in search of a job. His house was set fire by the owner's son with quarreling with his father. Due to the unexpected incident Hyderabad youth Suneel kumar dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X