వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగాల ఎర వేసిన ట్రైవ్యాలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri-Valley University
చాలా మంది తెలుగు విద్యార్థులు అమెరికాలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో చేరి ఆ తర్వాత ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయానికి మారినట్లు తెలుస్తోంది. వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామనే ఆశ చూపడంతో తెలుగు విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ఈ సిగ్గులేని విశ్వవిద్యాలయానికి మారినట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి సచివాలయంలోని ఎన్నారై విభాగం దీనిపై ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. భారతదేశం నుంచి ట్రైవ్యాలీలో చేరడానికి కేవలం వంద మంది భారతీయ విద్యార్థులు మాత్రమే వీసాలు పొందారని, మిగతా భారతీయ విద్యార్థులందరూ అమెరికాలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో చేరి ట్రైవ్యాలీకి మారినవారేనని నివేదిక బయట పెట్టింది.

ఐ - 20 ఫారాలు ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం తమకు అధికారం ఇచ్చిందని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. అయితే, 5,500 మంది విద్యార్థుల్లో కేవలం 140 మందికి మాత్రమే ట్రైవ్యాలీ నుంచి ఈ ఫారాలు పొందారు. హైదరాబాదుకు చెందిన కొంత మంది విద్యార్థులకు ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం ఆ ఫారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎఫ్-1 వీసా ఫారాలకు సంబంధించిన అక్రమాలను గుర్తించడంలో హైదరాబాదు, చెన్నై అమెరికా కాన్సులేట్ గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం లేదా ఏజెంట్ ఒక్కో విద్యార్థి నుంచి 25 లక్షల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేశారు. పని చేయడానికి చట్టబద్ధత లభిస్తుందనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ట్రై వ్యాలీకి మారినట్లు తెలుస్తోంది.

చాలా మంది విద్యార్థులకు రేడియా ట్యాగ్‌లు అమర్చి, వారిని విచారిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. విద్యార్థులను కాపాడి, వారికి న్యాయసహాయం అందించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X