ఉద్యోగాల ఎర వేసిన ట్రైవ్యాలీ
ఐ - 20 ఫారాలు ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం తమకు అధికారం ఇచ్చిందని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం తన వెబ్సైట్లో తెలిపింది. అయితే, 5,500 మంది విద్యార్థుల్లో కేవలం 140 మందికి మాత్రమే ట్రైవ్యాలీ నుంచి ఈ ఫారాలు పొందారు. హైదరాబాదుకు చెందిన కొంత మంది విద్యార్థులకు ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం ఆ ఫారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎఫ్-1 వీసా ఫారాలకు సంబంధించిన అక్రమాలను గుర్తించడంలో హైదరాబాదు, చెన్నై అమెరికా కాన్సులేట్ గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం లేదా ఏజెంట్ ఒక్కో విద్యార్థి నుంచి 25 లక్షల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేశారు. పని చేయడానికి చట్టబద్ధత లభిస్తుందనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ట్రై వ్యాలీకి మారినట్లు తెలుస్తోంది.
చాలా మంది విద్యార్థులకు రేడియా ట్యాగ్లు అమర్చి, వారిని విచారిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్కు లేఖ రాసినట్లు తెలిపారు. విద్యార్థులను కాపాడి, వారికి న్యాయసహాయం అందించాలని కోరినట్లు ఆయన తెలిపారు.