వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై డబ్బులు మింగేసిన నిత్యానంద స్వామి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda
నటి రంజితతో రాసలీలలు నడుపుతూ పట్టుబడిన స్వామి నిత్యానంద మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానంద స్వామిపై ఓ ఎన్నారై అమెరికాలోని కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు. తెలిసిన వివరాల ప్రకారం - పపట్‌లాల్ అనే ఎన్నారై నుంచి నిత్యానంద స్వామి మిలియన్ డాలర్లు విరాళంగా తీసుకున్నాడు. అమెరికాలో ఓ అశ్రమాన్ని, వేద విశ్వవిద్యాలయాన్ని, ఓ ఆలయాన్ని నిర్మిస్తానని నిత్యానంద స్వామి ఆ ఎన్నారైకి హామీ ఇచ్చాడట. ఆ హామీలను నెరవేర్చకపోగా, తన డబ్బులు ఏమయ్యాయో తెలియక ఎన్నారై నిత్యానంద స్వామిపై కోర్టుకెక్కాడని సమాచారం.

నిత్యానంద స్వామి తీసుకున్న మిలియన్ డాలర్ల విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయల మేరకు ఉంటుందని ఓ అంచనా. ఆ డబ్బుల గురించి అడిగితే నిత్యానంద స్వామి మొహం చాటేస్తున్నాడట. పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్న నిత్యానంద స్వామికి ఇది మరో ఎదురుదెబ్బగానే చెప్పాలి.

English summary
NRI filed case against Nityananda Swami in California court in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X