వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా నగరాల్లో భారత్ మాతా కీ జై

By Pratap
|
Google Oneindia TeluguNews

NRIs celebrating India's independance day on Aug 15
అమెరికాలోని వివిధ నగరాల్లో భారత్ మాతా కీ జై నినాదాలు మారుమ్రోగాయి. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. అన్నా హజారేకు వారు పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికాలోని బోస్టన్, హూస్టన్, వాషింగ్టన్ డిసి, చికాగో, ఎడిసన్, బే ఏరియా, లాస్ ఏంజిల్స్ తదితర నగరాల్లో పిఎఫ్ఎల్, ఐఎసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పెద్ద యెత్తున ఎన్నారైలు పాల్గొన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఫిర్యాదుపై విచారణ జరపడానికి కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, రాష్ట్ర స్థాయిల్లో లోకాయుక్త, జిల్లా స్థాయిల్లో అంబుడ్స్‌మెన్ ఏర్పాటు చేయాలని పిఎఫ్ఎల్ డిమాండ్ చేసింది. న్యూజెర్సీలో నిర్వహించిన వాక్‌లో జన్ లోక్‌పాల్ కావాలి, ఐ యామ్ అన్నా, అన్నా వుయ్ ఆర్ విత్ యూ వంటి నినాదాలు మారుమోగాయి. హూస్టన్‌లో గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు.

English summary
PFL demands Strong Lokpal, marched in India Day parade in various cities across US
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X