బాబా రామ్దేవ్కు ఎన్ఆర్ఐల మద్దతు
బ్రిటీష్ వాళ్లు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి రెండు వందల కోట్ల రూపాయలకు మించి లూటీ చేయలేదని కానీ ఆరవయ్యేళ్లలో పదిహేను వందల బిలియన్ డాలర్లను భారత్ను పాలిస్తున్న వారు లూటీ చేశారని న్యూజెర్సీకి చెందిన ప్రకాశ్ కపిలా ఆరోపించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఎన్ఆర్ఐ కూడా అన్నాహజారే జన్ లోక్పాల్ బిల్లుకు, బాబా రామ్ దేవ్ నల్లడబ్బు వెనక్కి తెప్పించే ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని కోరారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఉద్యమంలో భాగంగా 2జి కుంభకోణానికి వ్యతిరేకంగా పిఎఫ్ఎల్ కిల్ కరెప్షన్ పేరిట ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల జన్ లోక్పాల్ బిల్లుకు మద్దతుగా పిఎఫ్ఎల్ 240 మైల్స్ దూరం దండి మార్చ్ నిర్వహించినట్టు చెప్పారు.
కాగా న్యూఢిల్లీలోని బాబా రామ్దేవ్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసి హరిద్వార్ పంపించింది. న్యూఢిల్లీలో బాబాపై దొమ్మీ కేసు పెట్టింది. 15 రోజుల పాటు బాబా న్యూఢిల్లీ రాకుండా ఆంక్షలు విధించింది. అయితే హరిద్వార్ చేరుకున్న బాబా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్టు ప్రకటించారు.