వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపిపై దాడికి ఎన్నారైల ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాణయణ, కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలగుడు వెంకటరావుపై జరిగిన దాడిని, శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడాన్ని ప్రవాసాంధ్రుల సంస్థ పీపుల్స్ ఫర్ లోకసత్తా (పిఎఫ్ఎల్) ఖండించింది. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే చర్యగా జెపిపై దాడిని ఆ సంస్థ అభివర్ణించింది. శాసనసభలో గురువారం సంఘటనలు ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శించింది.

భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించారని విమర్సించింది. ఏ మేరకు పిఎఫ్ఎల్ ప్రతినిధి వినోద్ బండా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకసత్తా పోరాటం చేస్తోందని, గోదావరి జలాల దుర్వినియోగం, హైదరాబాదుకు కృష్ణా జలాలు వంటి పలు సమస్యలపై లోకసత్తా ఉద్యమం చేపట్టిందని ఆయన అన్నారు. లోకసత్తా తెలంగాణ ప్రజలకు అవకాశాలు లభించే విధంగా పనిచేస్తోందని ఆయన చెప్పారు.

లోకసత్తా ఒక సీటుకే పరిమితమైనా ప్రజాస్వామిక విలువలకు కట్టుబడడంలో ముందుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని, అయితే వాస్తవాలను వక్రీకరించకూడదని ఆయన అన్నారు. భయపెట్టి, బలప్రయోగం చేసి వాస్తవాలను మరుగు పరచలేరని వ్యాఖ్యానించారు. జెపిపై జరిగిన దాడికి నిరసనగా అమెరికాలోని బే ఏరియా, హూస్టన్, డల్లాస్ వంటి ప్రాంతాల్లో గురువారం బ్లాక్ డేగా పరిగణిస్తూ ఎన్నారైలు సమావేశాలు నిర్వహించారు.

English summary
"The acts of disruption of Governor's speech and attacks on legislators like Dr. Jaya Prakash Narayana & Mr. Paladugu Venkat rao,in AP state assembly have ridiculed the great democratic values the country was founded upon. These incidents are a glimpse, of the abyss; the democracy has been dragged down to" said NRI based PFL. People for Lok Satta(PFL) unequivocally condemns such assaults on democracy. Attacks like this impinge upon the inalienable right of free speech. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X