జెపిపై దాడికి ఎన్నారైల ఫైర్
భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించారని విమర్సించింది. ఏ మేరకు పిఎఫ్ఎల్ ప్రతినిధి వినోద్ బండా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకసత్తా పోరాటం చేస్తోందని, గోదావరి జలాల దుర్వినియోగం, హైదరాబాదుకు కృష్ణా జలాలు వంటి పలు సమస్యలపై లోకసత్తా ఉద్యమం చేపట్టిందని ఆయన అన్నారు. లోకసత్తా తెలంగాణ ప్రజలకు అవకాశాలు లభించే విధంగా పనిచేస్తోందని ఆయన చెప్పారు.
లోకసత్తా ఒక సీటుకే పరిమితమైనా ప్రజాస్వామిక విలువలకు కట్టుబడడంలో ముందుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని, అయితే వాస్తవాలను వక్రీకరించకూడదని ఆయన అన్నారు. భయపెట్టి, బలప్రయోగం చేసి వాస్తవాలను మరుగు పరచలేరని వ్యాఖ్యానించారు. జెపిపై జరిగిన దాడికి నిరసనగా అమెరికాలోని బే ఏరియా, హూస్టన్, డల్లాస్ వంటి ప్రాంతాల్లో గురువారం బ్లాక్ డేగా పరిగణిస్తూ ఎన్నారైలు సమావేశాలు నిర్వహించారు.