వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Satish Reddy
అమెరికాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మల్లవరం సతీష్‌రెడ్డి (36) మృతిచెందాడు. ఎనిమిదేళ్ల కిందట అమెరికాకు వెళ్లిన సతీష్‌రెడ్డి కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు మాధవరెడ్డి, కళమ్మలు హైదరాబాద్‌లోని హబ్సిగూడలో నివసిస్తున్నారు. ఈ మరణ వార్త తెలిసిన కేశిరెడ్డిపల్లి సర్పంచి సతీష్‌రెడ్డి చిన్నాన్న రమేశ్‌రెడ్డి, బంధువులు విషాదానికి లోనయ్యారు.

సతీష్‌రెడ్డి తండ్రి మాధవరెడ్డి ఆదివారం ఉదయం సొంతూరైన కేశిరెడ్డిపల్లికి వ్యవసాయ పని నిమిత్తం వచ్చాడు. అతనికి గుండెపోటు ఉండటంతో కొడుకు మరణించిన వార్తను అతనికి చెప్పకుండా ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సతీష్‌రెడ్డి భార్య, నాలుగేళ్ల కొడుకుతో కాలిఫోర్నియాలో ఉంటున్నారు.

సతీష్ రెడ్డి మృతదేహాన్ని స్వస్థలం పంపడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు, అందుకు సంబంధించిన అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, కార్యదర్శి రాంమోహన్ కొండా, వర్జీనియా ప్రాంతీయ సమన్వయకర్త మనోహర్ ఎనుగు ఆ ఏర్పాట్లలో ఉన్నారు.

English summary
A Telugu person Satish Reddy Mallavaram aged 35 who hails from Warangal district, Andhra Pradesh, is dead and two others seriously injured after a two-car crash on Route 9 in Loudoun County, police say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X