వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాయ్‌లో బస్సు ప్రమాదం: భారతీయులు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Thailand Map
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. బ్యాంకాక్ నుండి ప్రయాణీకులతో కూడిన ఒక బస్సు కో సముయ్ అనే రిసార్టుకు బయలుదేరిందని, దారి మధ్యలో దాని టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని థాయ్ పోలీసు అధికారులు చెప్పారు.

రిసార్టుకు వెళుతుండగా టైరు పేలిపోవడంతో బస్సు అదుపు తప్పి ఓ ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పదిహేడు మందికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు.

ప్రయాణీకులు బయలుదేరిన ఈ కో సముయ్ రిసార్ట్ ఉన్న ద్వీప ప్రాంతం పర్యాటక ప్రసిద్ధి చెందినది. ఈ ఘటన మంగళవారం ఉదయం సూరత్ థానీ సదరన్ ప్రావిన్స్‌లో జరిగిందని చెప్పారు. మిగతా మృతులు థాయ్‌లాండ్‌కు చెందిన వారని, చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని చెప్పారు.

English summary

 Thailand police said a tour bus heading to a Thai resort island blew a tire and crashed into an electricity pole, killing 10 people and wounding 17. Police said the crash early Tuesday in the southern province of Surat Thani killed two Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X