తెలుగు తేజానికి ప్రతిభా పురస్కారం
చాలా దేశాలకు సంబందిచిన ఇంజనీరింగ్ నిపుణలతో పోటీ పడి ఈ ఘనతను సాదించిన ఏకైక వ్యక్తిగా నిలిచినందుకు ఒమన్ తెలుగు కళా సమితి వారు ఒమన్ లో ఏప్రిల్ 6 వ తేదిన జరిగిన ఉగాది సుస్వరాలు కార్యక్రమంలో గుప్తాను సత్కరించారు. ఈ కార్యక్రమానికి కస్తూరి రంగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దుబాయ్ లో ఏప్రిల్ 27 వ తేదీన రిట్జ్ కార్ల్టోన్, డిఐఎఫ్సి హోటల్ లో జరిగిన నిట్ మూమెంట్స్ - 2012 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రణాళికా సంఘం సభ్యుడు పద్మ భూషణ్ డాక్టర్ కస్తూరి రంగన్ నిట్ వరంగల్లో ఎంటెక్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంజనీరింగ్ చదివిన గుప్తాను మధ్య ప్రాచ్యంలో ఉత్తమ ఇంజనీర్గా గుర్తించి అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ ఇంజనీర్ గా ఎన్నో క్లిష్టతరమైన ప్రాజెక్ట్స్ను విజయవంతంగా పూర్తీ చేయడంలో విశేష ప్రతిభ పాటవాలను, నైపుణ్యాన్ని గుప్తా ప్రదర్శించారు.
గుప్తా ఇప్పటివరకు 6 అవార్డులు, 13 సత్కారాలను ఇండియా, ఒమన్ మరియు దుబాయ్ దేశాలలో కేవలం మూడున్నర ఏళ్ల వ్యవధిలోనే అందుకోవటం విశేషం. ఈ ఘనతను సాదించినందుకు, భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఇలాంటి విజయాలతో విదేశాలలో పెంచుతున్నందుకు దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు గుప్తాను అభినందించారు.