అబార్షన్కు నో: భారత మహిళ మృతి
ఆమె 17 వారాల గర్భవతి. ఆమె మిస్ క్యారేజీతో బాధపడుతోంది. సెప్టికేమియాతో కూడా బాధపడుతోంది. గాల్వేలోని బోస్టన్ సైంటిఫిక్ ఇంజనీర్ అయిన ఆమె భర్త ప్రవీణ్ హలపనవార్ - అబార్షన్ చేయాలని మూడు రోజులుగా ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాని చెప్పారు.
ఓ రోజు సవిత భరించలేనంత నొప్పితో బాధపడిందని, దాంతో అబార్షన్ కోసం అడిగామని చెప్పారు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటోందని, ఇది కాథలిక్ దేశం కాబట్టి మనిషి చంపే అబార్షన్ చేయబోమని వైద్యులు చెప్పారని ఆయన వివరించారు.
మృతశిశువును తర్వాత బయటకు తీశారు. సవితను హై డిపెండన్సీ యూనిట్కు, ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించారు. అయితే, ఆమె అక్టోబర్ 28వ తేదీన యూనివర్శిటీ ఆస్పత్రి గాల్వేలో సెప్టికేమియాతో మరణించింది. ఐర్లాండ్లో అబార్షన్ చట్ట విరుద్దం. అయితే, సవిత మృతిపై దర్యాప్తు సాగుతోంది. తాను ఐరిష్ను గానీ కాథలిక్ను గానీ కానని కర్ణాటకకు చెందిన సవిత మరణించే ముందు అన్నారు.