వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోలుకుంటున్న తెలుగు విద్యార్థి

By Pratap
|
Google Oneindia TeluguNews

Praveen Reddy
దాడిలో గాయపడి లండన్‌లోని రాయల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి ప్రవీణ్ రెడ్డి కోలుకుంటున్నాడు. ప్రవీణ్ రెడ్డి తండ్రి సుధాకర్ రెడ్డి, అంకుల్ మాధవ రెడ్డి సోమవారం ఉదయం లండన్‌లోని ఆస్పత్రికి చేరుకున్నారు. వారిని భారత హై కమీషన్ కార్యాలయం అధికారులు విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఊపిరితిత్తుల్లోని రక్తం గడ్డలను తొలగించడానికి ప్రవీణ్ కుమార్ రెడ్డికి శస్త్ర చికిత్స జరిగింది.

ప్రవీణ్ రెడ్డిని కత్తులతో పొడిచిన వాళ్లలో నిశాంత్ పుట్టపాక ముఖ్యుడని ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్పారు. నిశాంత్ కుటుంబ సభ్యులతో ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులకు దూరం బంధుత్వం ఉంది. ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదా ఉన్నట్లు చెబుతున్నారు. కొత్తపేటలోని యూనివర్శల్ ఓవర్సీస్ సర్వీస్ ద్వారా నిశాంత్, ప్రవీణ్ రెడ్డి ఒకేసారి యుకెకు వెళ్లారు.

ప్రవీణ్ రెడ్డి ఫోన్ చేసి నిశాంత్ గురించి చెడుగా ఏమీ చెప్పలేదని, అయితే ఆస్తి తగాదా కారణంగా నిశాంత్ కక్ష పెంచుకుని ఉంటాడని అంటున్నారు. నిశాంత్ పుట్టపాక పాస్‌పోర్టును కన్సల్టెన్సీ సర్వీసు నుంచి తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఆర్‌బి నగర్‌లో నిశాంత్ తండ్రి నరేంద్ర రావు ఉంటున్నారు.

English summary
The father and uncle of Praveen Reddy, the MBA student who was critically stabbed on Friday night in his flat in London, visited him at the Royal Hospital in London on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X