న్యూయార్క్లో పిఎఫ్ఎల్ మార్చ్
పీపుల్ ఫర్ లోక్సత్తా, ఇండియా అగెనెస్ట్ కరప్షన్లకు చెందిన దాదాపు 40 మంది వాలంటీర్లు ఈ మార్చ్లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలను, సుపరిపాలనను కోరుతూ వారు ఈ ప్రదర్శన నిర్వహిచారు. పిఎఫ్ఎల్ టీ షర్టులు ధరించి, సురాజ్య ఉద్యమ ప్లకార్డులను చేతబూని మార్చ్ చేశారు. వందేమాతరం, జై హింద్, పీపుల్ ఫర్ లోక్సత్తా, జై కిసాన్ జై జవాన్ నినాదాలు చేశారు. ఈ మార్చ్ మాడిసన్ ఎవెన్యూ 38వ స్ట్రీట్ నుంచి 23వ స్ట్రీట్ వరకు జరిగింది.
వారి నినాదాలు చూపురులను ఆకర్షించాయి. వారు కూడా మార్చ్లోకి వచ్చి చేరారు. పిఎఫ్ఎల్ మార్చింగ్ గ్రూపునకు ఇండియా అగెనెస్ట్ కరప్షన్ వాలంటీర్లు మద్దతు తెలిపారు. ఇరు పక్షాలు మార్చ్లో పాల్గొన్నాయి. నినాదాలు చేశాయి. ఆ తర్వాత పరేడ్ జరిగింది. జాతీయ గీతాలాపన చేశారు. పరేడ్లో పిఎఫ్ఎల్ పాల్గొనడం ఇది వరుసగా మూడో సంవత్సరం
ఎన్నారైలకు వోటింగ్ హక్కును కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా పిఎఫ్ఎల్ పనిచేస్తూ వస్తోంది. సురాజ్య స్థాపన కోసం పనిచేస్తామని పిఎఫ్ఎల్ కార్యకర్తలు అన్నారు. శ్రీనివాస్ రనబోతు, శ్రీనివాస్ కరతూరి, సురేష్ ఏడిగ, న్యూజెర్సీ టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.