న్యూజిలాండులో భారత విద్యార్థి అదృశ్యం
అంకుర్ గత నెల 9వ తేది నుండి కనిపించడం లేదని తెలుస్తోంది. న్యూజిలాండు నార్త్ ఐస్లాండులోని అక్లాండ్ నగరంలోని మనురేవా నుండి అదృశ్యమయ్యాడు. అతడి ఆచూకి తెలియకుండా పోయిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారి చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు విద్యార్థి వీసా పైన న్యూజిలాండ్ వచ్చాడని, అక్లాండులోని మనురివా శివారు ప్రాంతంలో నివసిస్తున్నాడని, గత నెల 9వ తేదిన గది నుండి వెళ్లిన అతను కనిపించడం లేదని పోలీసులు అధికారి వెల్లడించారు. మనురివా ప్రాంతంలో అతడి గురించి వాకబు చేసినట్లు చెప్పారు.
ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎక్కడున్నా తమను సంప్రదించాలని పోలీసు అధికారి చెప్పారు. అక్లాండు పరిసర ప్రాంతాల్లోనే అతను సురక్షితంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామన్నారు. అంకుర్ వీసా కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితే ముగియనుంది. అంకుర్ శర్మ అచూకీ తెలియని నాటి నుండి భారత్లోని అతని కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది.