ఆర్జెలను నిందించిన జసింత
నర్సు తన ఆస్పత్రి మేనేజర్లకు చేతితో లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. తన క్షమించాలని, తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆమె ఓ సూసైడ్ నోట్లో తెలిపింది. తనకు మద్దతు ఇచ్చినవారందదరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన మృతికి రేడియో ఆస్ట్రేలియాకు చెందిన మెల్ గ్రెగ్, మైకేల్ క్రిస్టియన్ బాధ్యులని ఆమె చెప్పింది.
తాను తీవ్ర నిస్పృహకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇందుకు తన సహోద్యోగులు ఎంత మాత్రం కారణం కారని ఆమె మరో సూసైడ్ నోట్లో రాసింది. తన అంత్యక్రియలు భారతదేశంలో జరగాలని కూడా ఆమె కోరినట్లు తెలుస్తోంది.
రాజరహస్యాలను పొరపాటున బయటపెట్టిన భారత సంతతికి నర్సు బ్రిటన్లో ప్రాణాలు కోల్పోయింది. బ్రిటన్ కాబోయే యువరాణి కేట్ మిడిల్టన్ వేవిళ్ల వ్యవహారంలో - ఆమె ఆరోగ్య వివరాలు ఆస్ట్రేలియన్ డీజేలకు తెలియడానికి కారణమైన భారతీయ నర్సు జసింతా సల్దానా(46) డిసెంబర్లో చెట్టుకు ఉరేసుకుని చనిపోయింది.