26న అమెరికాలో ‘అఖిల్’ అడియో లాంచ్(ఫొటోలు)
న్యూయార్క్: అక్కినేని వారసుడిగా టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న అక్కినేని నాగేశ్వర్ రావు మనవడు, నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ ‘అఖిల్' అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల మందుకు వస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ను అఖిల్ అమెరికాలో చేపట్టేందుకు సన్నాహాలు చేసుకున్నారు.
కాగా, శనివారం(సెప్టెంబర్ 26న) డల్లాస్లో నిర్వహించనున్న ఈ చిత్ర అడియో ఫంక్షన్ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో అక్కినేని అఖిల్, వివి వినాయక్, అనూప్ రూబెన్స్, సయేషా సెహగల్, చిత్ర యూనిట్ పాల్గొంటుంది.
ఈ సందర్భంగా అక్కినేని జయంతి వేడుకలను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. పలు సంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలకునేవారు [email protected]లో రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు ప్రసాద్ తోటకూర తెలిపారు.
మిగితా వివరాల కోసం శ్రీకాంత్ పోలవరపు 248-497-1029, మురళీ వెన్నం 817-965-2500, చల కొండ్రకుంట 469-323-8789, రాజేష్ అడుసుమిల్లి 732-406-6980లను సంప్రదించవ్చని చెప్పారు. ప్రవేశం ఉచితమేనని తెలిపారు.
కాగా, అఖిల్ నటిస్తున్న ‘అఖిల్' చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా, హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో అఖిల్ సరసన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు సయేషా సెహగల్ నటిస్తున్నారు. సంగీతం అనూప్ రూబెన్స్.