ఘనంగా ముగిసిన 'ఆటా' నోవీ క్రికెట్ కప్
హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) నోవీ సిటీ, డీఎఫ్సీలతో భాగస్వామ్యమై నోవీ సిటీ గ్రౌండ్స్లో డే/నైట్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించింది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని భారత్కు చెందిన ఛారిటీ ఆర్గనైజేషన్ అయిన 'వందేమాతరం ఫౌండేషన్'కు ఆటా విరాళంగా ఇచ్చింది.
మిచిగాన్లో ఉన్న నోవీ స్కూల్ ద్వారా సుమారు 29వేల మంది చిన్నారులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించడంలో ఈ ఆర్గనైజేషన్ ఎంతగానో దోహదపడింది. ఈ టోర్నమెంట్లో నోవీ, ట్రాయ్, ఫర్మింగ్టన్, డెట్రాయిట్కు చెందిన ఎన్నారై క్రికెటర్లు ఇందులో పాలుపంచుకున్నారు.
ఈ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లకు చెందిన 180 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్కు డెట్రాయిట్తో పాటు చుట్టుపక్కల ఉన్న సిటీల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వర్షం కారణంగా టోర్నమెంట్ పైనల్ మ్యాచ్ వాయిదా పడకపోయినా, ఫ్లడ్ లైట్ల మధ్యలో ఫైనల్ మ్యాచ్ని నిర్వహించారు.
ఈ టోర్నమెంట్ ఫైనల్ విజేతగా Prometheus జట్టు గెలుపొందగా, రన్నరప్గా ట్రాయ్ క్రికెట్ అసోసియేషన్ నిలిచింది. ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించడంలో ఆటా సభ్యులైన యుగంధర్ భూమిరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి లింగాల, మురళీ బొమ్మనేని, వినోద్ కుకునూర్, నాగేందర్ ఆయత, రావు నేరుసు, రామరెడ్డి, రామచంద్రారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.