వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ విషాదం అమెరికాలో కామారెడ్డి జిల్లా వాసి వెంకట్రామిరెడ్డి మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కామారెడ్డి/డల్లాస్: అమెరికాలోని ఉత్తర టెక్సాస్‌లో జరిగిన ప్రమాదంలో తెలంగాణాలోని కామారెడ్డి జిల్ా మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి మరణించాడు.

కుటుంబసభ్యులతో కలిసి శనివారం నాడు గ్రేప్‌వైన్ సరస్సులో బోటింగ్ చేయడానికి వెళ్ళిన వెంకట్రామిరెడ్డి మరణించాడు. పొంటూన్ బోటు నుండి ఈత కొట్టేందుకు నీళ్ళలోకి దూకిన ఆయన ఎంతకీ పైకి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి సమాచారమిచ్చారు.

Authorities recover the body of a man who went missing in Grapevine Lake

24 గంటల తర్వాత వెంకట్రామిరెడ్డి మృతదేహం సరస్సులో దొరికింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో సుమారు 12 మంది ఉన్నారు. వెంకట్రామిరెడ్డి డల్లాస్ లోని గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రోఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వాణి కూడ ఉద్యోగిని. ఈ విషయాన్ని వెంకట్రామిరెడ్డి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదివారం అదే సరస్సులో జరిగిన మరో ప్రమాదంలో సరస్సులో మునిగిపోయిన ఓ 25 ఏళ్ల యువకుడిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.

అతడిని బెయిలర్‌ స్కాట్‌ అండ్‌ వైట్‌ మెడికల్‌ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో బాధితులు లైఫ్‌ జాకెట్‌ ధరించకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని గ్రేప్‌ వైన్‌ ఫైర్‌ డిపార్ట్‌ మెంట్‌ అసిస్టెంట్‌ చీఫ్‌ జాన్‌ షేర్‌వుడ్‌ తెలిపారు.

English summary
Authorities in Grapevine reported that the body of a man who went missing in the Grapevine Lake yesterday was recovered on Sunday afternoon.Grapevine Fire reported that on Saturday, May 12, a few people were out in Grapevine Lake when Venkatramreddy jumped from a pontoon boat and never resurfaced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X