సియాటెల్ డిప్యూటీ మేయర్గా.. చెన్నై మహిళ!
భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షెఫాలీ రంగనాథన్(38) అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్ కు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.
చెన్నై: భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షెఫాలీ రంగనాథన్(38) అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్ కు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.
2014-15 నుంచి రవాణా విభాగంలో షెఫాలీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటున్నారు. ఆ రంగంలో ఆమె రాణించడంతో ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కన్ షెఫాలీని తన టీమ్లో చేర్చుకుని డిప్యూటీ మేయర్గా నియమించారు.
చిన్నతనం నుంచి షెఫాలి చురుకైన వ్యక్తి అని, చదువులోనూ, ఎంచుకున్న వృత్తిలోనూ ముందుండేదని ఆమె తండ్రి ప్రదీప్ రంగనాథన్ తెలిపారు. ఆయన 2001లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
షెఫాలీ పాఠశాల విద్యాభ్యాసం అంతా చెన్నైలోని నూగంబాక్కంలో సాగింది. స్టెల్లా మేరీస్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేయగా, అన్నావర్సిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఆమె గోల్డ్ మెడల్ కూడా పొందారు.