బహ్రెయిన్లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు, మొక్కలు నాటి విషెస్..
తెలంగాణ సీఎం కేసీఆర్ 67వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటి జరిపాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బహ్రెయిన్లో కూడా కేసీఆర్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు. మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఆయన బహ్రెయిన్లో మొక్కలు నాటి.. నీళ్లు పోశారు. తొలి సీఎంగా ఏడున్నర ఏళ్లలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం అహార్నిలు శ్రమిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో భాగమైన పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాధారపు సతీష్ కుమార్ అన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ సేవలు రాష్టానికే కాకుండా దేశానికి ఎంతో అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటు జగిత్యాల జిల్లా వేంపేటలో కూడా కేసీఆర్ బర్త్ డే వేడుకలు జరిగాయి. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ జనరల్ సెక్రటరీ మగ్గిడి రాజేందర్ మొక్క నాటి.. కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.