ఐఏఎఫ్సి ఆధ్వర్యంలో ఓసీఐ వర్క్షాప్(పిక్చర్స్)
టెక్సాస్: భారతీయ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్సి) ఆధ్వర్యంలో 'ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ)' వర్క్షాప్ను డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రవాసులు హాజరయ్యారు.
జనరల్ ఆఫ్ ఇండియా(హూస్టన్ ఆఫీస్) పూర్తి సహకారం అందించగా, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్టి), డీఎఫ్డబ్ల్యూ ప్రాంతం ఇండియా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ మద్దతుతో ఆగస్టు 20న ఈ కార్యక్రామాన్ని డల్లాస్లో వైభవంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఓసీఐ వర్క్షాప్
భారతీయ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్సి) ఆధ్వర్యంలో ‘ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ)' వర్క్షాప్ను డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రవాసులు హాజరయ్యారు.
ఓసీఐ వర్క్షాప్
జనరల్ ఆఫ్ ఇండియా(హూస్టన్ ఆఫీస్) పూర్తి సహకారం అందించగా, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఐఏఎన్టి), డీఎఫ్డబ్ల్యూ ప్రాంతం ఇండియా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ మద్దతుతో ఆగస్టు 20న ఈ కార్యక్రామాన్ని డల్లాస్లో వైభవంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఓసీఐ వర్క్షాప్
హూస్టన్ ఆఫీస్ కాన్సల్ సీజీఐ నుంచి ముగ్గురు అధికారులు ఆర్డి జోషి, రాకేష్ శర్మ, చంద్రసేన్ ఈ కార్యక్రామానికి విచ్చేశారు.
ఓసీఐ వర్క్షాప్
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి 150మందికి పైగా ప్రజలు హాజరయ్యారు.
ఓసీఐ వర్క్షాప్
ఐఏఎఫ్సి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తయబ్ కుండవాలా కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఓసీఐ వర్క్షాప్
సీజీఐ నుంచి ప్రతినిధులు వచ్చి తమ విలువైన సమయాన్ని కార్యక్రమంలో కేటాయించడం పట్ల ఐఏఎఫ్సి ప్రెసిడెంట్ డా. ప్రసాద్ తోటకూర హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, వారు అందించిన సహకారం మరువలేనిదని ప్రశంసించారు.
ఓసీఐ వర్క్షాప్
ఎన్నారైలకు చేస్తున్న సేవలకు గాను సీజీఐ డా. అనుపమ్ రేకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన తెలిపారు.
ఓసీఐ వర్క్షాప్
కార్యక్రమ విజయవంతానికి సహకరించిన వారందరికీ తయబ్ కుండవాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఓసీఐ వర్క్షాప్
ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్సి రావు కల్వల, ఐఏఎఫ్సి సెక్రటరీ డా. నిరంజన్ త్రిపాఠి, ఐఏఎన్ సెక్రటరీ టినర్సింహ భక్తుల(బి.ఎన్), ఐఏఎన్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శైలేష్ షా, ఎన్ఏఎస్ఐఎం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ముజీబ్ సయ్యద్, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
ఓసీఐ వర్క్షాప్
ఐఏఎఫ్సి అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అబిద్ అబేది, ఐఏఎన్టి ప్రెసిడెంట్ ఇందు మందాడి, ఐఏఎన్టి ప్రెసిడెంట్ ఎలెక్ట్ సల్మాన్ ఫర్షోరి, ఐఏఎన్టి ట్రస్టీలు శోబ్నమ్ మోద్గిల్, సుధీర్ పరీఖ్, జాక్ గోధ్వానీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.