వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యజమాని కుమారుడి కాల్పులు: ఎన్నారై మృతి

|
Google Oneindia TeluguNews

రియాద్: ఉపాధి కోసం సౌదీ అరేబియా వచ్చిన ఓ భారతీయు యువకుడు తన యజమాని కుమారుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగింది. బాధితుడు సౌదీ అరేబియాకు వచ్చిన వారం రోజులకే(గత శుక్రవారం) ఈ ఘటన చోటు చేసుకుంది.

మక్కా పోలీసుల కథనం ప్రకారం.. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అనాస్ పుద్విలికాల్వి(24) మక్కాలోని ఓ వ్యక్తి ఇంట్లో కారు డ్రైవర్‍‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు వారం రోజుల క్రితమే సౌదీ అరేబియాలోని మక్కాకు వచ్చాడు.

Indian driver shot dead by employer's son in Saudi Arabia

శుక్రవారం తన యజమాని కుటుంబ సభ్యులను తౌఫా తీసుకెళ్లిన అనాస్ పుద్విలికాల్వి.. తిరిగి అదే రాత్రి వారి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే యజమాని కుమారుడు.. అనాస్‌పై కాల్పులు జరిపాడు.

కాల్పుల్లో అనాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని మక్కాలోని కింగ్ ఫైసల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చెప్పారు.

English summary
A 24-year-old Indian, who had arrived in Saudi Arabia a week ago, was shot dead by his employer's son in Mecca.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X