భార్యను చంపిన భర్తకు జైలు శిక్ష
వెల్లింగ్టన్: తన భార్యను చంపిన ఓ భారత సంతతి వ్యక్తికి న్యూజిలాండ్లో జీవిత ఖైదు పడింది. బెయిల్పై బయటకు వచ్చిన అతను భార్యను హత్య చేశాడు. వెల్గింగ్టన్ హైకోర్టు గురువారంనాడు రాజేశ్వర్ సింగ్ అనే 47 వ్యక్తికి 16 ఏళ్ల పాటు పెరోల్ లేకుండా, జైలు శిక్షను ఖాయం చేస్తూ, అదే సమయంలో మూడు నెలల జైలు శిక్షను కోర్టు విధించింది.
రాజేశ్వర్ సింగ్ గత నవంబర్లో శర్వాన్ లతను హత్య చేశాడు. అతను కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. రక్షిత ఆదేశాలను ఉల్లంఘించిన అభియోగాల్లో గత నెలలో అతనికి బెయిల్ మంజూరైంది. ఆమెను చూడడం గానీ ఆమె ఇంటి సమీపంలోకి వెళ్లడం గానీ చేయకూడదనే షరతులపై గతంలో బెయిల్ మంజూరైంది.
అయితే, షరతులను ఉల్లంఘించి అతను ఆమె ఇంటీ సమీపానికి పదే పదే వెళ్లి హత్యకు పూనుకున్నాడు. వారిద్దరు 1991లో ఫిజిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1998లో న్యూజిలాండ్ వచ్చారు. వారికి ఓ కుమారుడు పుట్టాడు. అయితే మస్క్యూలర్ డిస్ట్రోఫీతో 2011లో మరణించాడు.
దంపతులు చాలా కాలంగా శారీరక, బౌద్ధిక దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. 2003 నుంచి తొమ్మిది కుటుంబ హింసకు సంబంధించిన సంఘటనలు జరిగాయని అన్నారు. 22 ఏళ్లలో లెక్కలేనన్ని సంఘటనలు జరిగాయని చెప్పారు.