వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో దారుణం.. నలుగురు తెలుగువారి అనుమానాస్పద మృతి

|
Google Oneindia TeluguNews

లోవా : అమెరికాలోని అయోవా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. వెస్ట్ డి మాయిస్ సిటీలో ఈ ఘటన జరిగింది. మృతులను సుంకర చంద్రశేఖర్, లావణ్యలతో పాటు 15, 10ఏళ్లున్న వారి కుమారులుగా గుర్తించారు. మృతదేహాలపై ఉన్న గాయాల ఆధారంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

మృతులు నివాసముంటున్న ఇంట్లో మరో కుటుంబం అద్దెకు ఉంటోంది. వారు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌‌మార్టంకు పంపారు. ఘటనాస్థలంలో పరిస్థితిని బట్టి హత్య అయి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. అయితే ఎవరు ఏ కారణం చేత ఈ దారుణానికి పాల్పడ్డారన్నది ఇంకా స్పష్టం కాలేదు.

IndianOrigin Family In US Shot Dead

పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు చంద్రశేఖర్‌ది గుంటూరు జిల్లాగా తెలుస్తోంది. చుండూరులో చదువుకున్న ఆయన ఉన్న విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.

English summary
Four members of an Indian-origin family, including two boys, were shot dead inside their home in West Des Moines, United States. The incident took place on Saturday morning. The family members were identified as Chandrasekhar Sunkara, 44; Lavanya Sunkara, 41; and two boys, ages 15 and 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X