డల్లాస్లో అంతర్జాతీయ యోగా డే(పిక్చర్స్)
డల్లాస్: అమెరికాలోని డల్లాస్లో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజిఎంఎన్టి), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇర్వింగ్ సిటీలో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించారు.
సుమారు 300మంది ప్రవాస భారతీయులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయయామం, భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎంఎన్టి ఇంటర్నేషనల్ ఛైర్మన్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. యోగా అనేది ఆరోగ్యానికి, మానసిక వికాసానికి తోడ్పడుతుందని అన్నారు.
మానవ జాతికి యోగా అవసరమని చెప్పారు. ఇది ఒక రోజు చేస్తే సరిపోదని.. ప్రతి రోజూ చేస్తూనే ఉండాలని అన్నారు. యోగాకు హద్దులు లేవని, యోగా దినోత్సవం రోజున 192 దేశాల్లో సుమారు 200 కోట్ల మంది యోగా చేశారని చెప్పారు.
ఎంజిఎంఎన్టి కార్యదర్శి రావు కల్వల, బోర్డు డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం రజనీష్ గుప్త, శ్రీధర్ తుల్జరామ్, నిక్ ష్రాఫ్, అంకుర్ బోరా, దీప, మోడ్గిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎంజిఎంఎన్టి కో ఛైర్మన్ తైయాబ్ కుంద్వాలా కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అక్టోబర్ 2న నిర్వహించే గాంధీ శాంతి- పాదయాత్రలో పాల్గొనాలని కోరారు.
యోగా డే
అమెరికాలోని డల్లాస్లో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
యోగా డే
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజిఎంఎన్టి), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇర్వింగ్ సిటీలో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించారు.
యోగా డే
సుమారు 300మంది ప్రవాస భారతీయులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయయామం, భజనలు చేశారు.
యోగా డే
ఈ కార్యక్రమంలో ఎంజిఎంఎన్టి ఇంటర్నేషనల్ ఛైర్మన్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. యోగా అనేది ఆరోగ్యానికి, మానసిక వికాసానికి తోడ్పడుతుందని అన్నారు.
యోగా డే
మానవ జాతికి యోగా అవసరమని చెప్పారు. ఇది ఒక రోజు చేస్తే సరిపోదని.. ప్రతి రోజూ చేస్తూనే ఉండాలని అన్నారు.
యోగా డే
యోగాకు హద్దులు లేవని, యోగా దినోత్సవం రోజున 192 దేశాల్లో సుమారు 200 కోట్ల మంది యోగా చేశారని చెప్పారు.