కువైట్లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
కువైట్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమెల్సీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యంలో ఘనంగా నివహించారు. కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ సందర్బంగా సుధాకర రావు మాట్లాడుతూ.. లోకేష్ దేశంలోనే మంచి రాజకీయ నాయకుడన్నారు. ప్రజాసేవలో తాత ఎన్టీఆర్ని, తండ్రి చంద్రబాబునాయుడుని, మామ నందమూరి బాలకృష్ణని మించిపొతున్నారన్నారు.
పీఆర్వో ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో లోకేష్ పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు పల్లెల్లో వేయించిన సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ లైట్లు తప్ప ఇప్పటి ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. ఇప్పటి ప్రభుత్వంలో మంత్రులు బూతులు తిట్టటానికే సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు తప్ప అభివృద్ది అనేదాన్ని మర్చిపోయారన్నారు.
ఏనుగొండ నరసింహులు, ఈడుపుగంటి ప్రసాద్, బోయపాటి శ్రీను, విజయ కూమర్, గంటా గోపి,వంశీ, నరేష్, మంచూరి శివ, గూదె శంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.