కువైట్-తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు
కువైట్: కువైట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంత్రిగా లోకష్ అద్బుత ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా నవ్యాంధ్రకు ఎన్నో ఐీ కంపెనీలను తీసుకువస్తున్నారని, వాటిని నెలకొల్పడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు.
టీడీపీ కువైట్ ప్రధాన కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ.. నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏపీలో ఉన్న మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధిని విస్తరించేలా కృషి చేశారని కొనియాడారు. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని చెప్పారు.
ఎన్నో అవార్డులు తీసుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో ఈశ్వరనాయుడు, సంక్షేమ కార్యదర్శి నాగార్జున, అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి రాధామాధవ్ తదితరులు పాల్గొన్నారు.