ఆస్ట్రేలియాలో నాయని నరసింహ రెడ్డికి ఘనస్వాగతం
సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు అడుగుపెట్టిన హోం శాఖా మాత్యులు నాయని నరసింహ రెడ్డికి సిడ్నీలో ఘనస్వాగతం లభించింది.
శుక్రవారం ఉదయం సిడ్నీలోని కింగ్స్ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి నాయని నరసింహ రెడ్డికి ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులతో పాటు వివిధ తెలంగాణ సంఘాలైన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరమ్, ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.
ఇండియన్ కాన్సులర్ జనరల్ - స్.కే. వెర్మ - ఇండియన్ హై కమిషన్ - ఆస్ట్రేలియా తరఫున మర్యాద పూర్వకంగా స్వాగతించారు. ఈ పర్యటనలో నాయని నరసింహ రెడ్డి ఆస్ట్రేలియాలోని పలు రాజకీయ నాయకులను కలుసుకుని తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించనున్నారు. అదే విధంగా డిసెంబర్ 2న ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, అనిల్ మునగాల, ప్రదీప్ సేరి, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్ , సుమేష్ రెడ్డి , వాసు తాట్కూర్, ప్రశాంత్ కడపర్తి, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలేట, భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి , నరసింహా రెడ్డి తదితరులు నాయనికి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
ఏటిఫ్ ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో నాయని నరసింహరెడ్డితో పాటు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు - వి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు సంతోష్ గుప్తా పాల్గొంటారు.