ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం: కొండగట్టుపై ఎన్నారై టీఆర్ఎస్ అన్నదానం, ప్రత్యేక పూజలు
కరీంనగర్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవం సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం నాయకత్వంలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.

కొండగట్టుపై ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు
దాదాపు 2000లకుపైగా భక్తులు అన్నదానం లో పాల్గొని ఎమ్మెల్సీ కవిత చల్లగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంక రవి శంకర్ ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కవిత నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ప్రజలకు మరింత సేవ చెయ్యాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు.

తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పది
ఎమ్మెల్యే రవి శంకర్ కేక్ కట్ చేసి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. కవిత పుట్టినరోజు సందర్భంగా కొండగట్టు మీదికి వచ్చి భక్తులకు అన్న దానం చేయడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అనిల్ కూర్మాచలం బృందాన్ని ఆయన అభినందించారు.
అలాగే ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని ముఖ్యంగా లండన్ నుంచి ఎన్నారై టీఆర్ఎస్ ఇచ్చిన స్ఫూర్తి గొప్పదని తెలిపారు. కవిత ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరువుకోవాలని ఆకాంక్షించారు.

తోబుట్టువులా ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహం
అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. కొండగట్టు పై అన్నదాన కార్యక్రమానికి సహకరించి ప్రోత్సహించిన ఎమ్మల్యే రవి శంకర్కు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, ఆలయ సిబ్బందికి ఆలయ అర్చకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారైలకు కవిత ప్రోత్సాహాం ఎప్పటికి మరువలేనిదని ఒక తోబుట్టులాగా అన్ని సందర్భాల్లో అండగా ఉంటున్నారని, ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, దాదాపు 24 ఘంటల నుంచి నిర్విరామంగా కష్టపడి పని చేసిన సహచర ప్రతినిధులు రాజ్ కుమార్ శానబోయిన, రాజేష్ భండారి, దూస గణేష్, ప్రమోద్ కక్కెర్ల, సుధాకర్, మారుతీ తదితరులకు అనిల్ కూర్మాచలం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. చివరిగా పేదలకు వస్త్ర దానం చేశారు.