లండన్లో ఎన్టీఆర్ వర్ధంతి, నివాళి
లండన్: లండన్ ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీ యుకె యూరప్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో వెస్ట్ లండన్లో నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలివచ్చి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, నేతలు పయ్యావుల కేశవ్, నన్నపనేని రాజకుమారి నటి కవిత, ఎల్విఆర్కె ప్రసాద్, టి. డి జనార్ధన్, ఖొల్లు రవీంద్ర, మోహన్, దుర్గ చౌదరి, వావిలాల సరళ దేవి, ఫోన్ లైవ్ ద్వారా తమ సందేశాన్నిఅందించారు.
కోర్ టీం సభ్యులు రవి, కిరణ్, విభాగం అధ్యక్షుడు జై కుమార్ ఎన్టీఆర్ను కొనియాడారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.
తెలుగు జాతికి గుర్తింపు తెచ్చి, తెలుగు జాతి ఉనికికి ప్రతీకగా నిలిచిన ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.