మంత్రి పల్లెకు టిఏజిబి ఘనస్వాగతం: విరాళాలు(పిక్చర్స్)
బోస్టన్: తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్(టిఏజిబి) ఆధ్వర్యంలో అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని, టిఏజిబి అధ్యక్షులు శంకర్ మాగాపు, టిఏజిబి ఛైర్ పర్సన్ ప్రకాష్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ బచ్చు తదితరులు ప్రసంగించారు.
శశికాంత్ వల్లేపల్లి , శ్రీనివాస్ కాకి, సత్య పరకాల, కృష్ణ వెంపటి, చంద్ర తాళ్లూరి, తదితర ప్రముఖులతో సహా పలువురు మంత్రిని అభినందించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడుతున్న రాజధాని అమరావతి నగరం తెలుగు తల్లికి మణిమకుటముగా నిలుస్తుందని, అఖండ భారతావనికి గర్వకారణమౌతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
అలనాటి శ్రీ కృష్ణదేవరాయల హంపి నగరంలా మన అమరావతి నగరం కూడా శతసహశ్ర శోభలతో వెలుగాలనే ఆకాంక్షతో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి లక్షా50వేల ఇటుకలకు విరాళంగా పలువురు దాతలు ముందుకొచ్చారు.
శశికాంత్ వల్లెపల్లి తన మితృులతో కలిసి మరొక లక్షా10 వేల ఇటుకలను అమరావతి రాజధాని నిర్మాణానికి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. 12మంది పారిశ్రామిక వేత్తలు తమ పెట్టుబడులకు, వాణిజ్య సంస్థల స్ఠాపనకు సంసిద్దత వ్యక్తం చేశారు.
ఎక్కడవున్నా తెలుగు వారంతా ఒకటేనన్న సంఘీభావానికి సూచనగా ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలవారు సమంగా పాలుపంచుకుని ఏపి సిఎం చంద్రబాబునాయుడు నేతృత్వాన్ని ప్రశంసించారు. ఈ సమావేశానికి కేవలం ఆంధ్రప్రదేశ్ వారే కాకుండా పలువురు తెలంగాణ ప్రవాసులు కూడా రావటం, విరాళాలు ప్రకటించటం హర్షదాయకమని టిఏజిబి ప్రతినిధులు అన్నారు.
టిఏజిబి-మంత్రి పల్లె
తెలుగుఅసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్(టిఏజిబి) ఆధ్వర్యంలో అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
టిఏజిబి-మంత్రి పల్లె
ఈ కార్యక్రమంలో తానామాజీ అధ్యక్షులు మోహన్ నన్నపనేని, టిఏజిబి అధ్యక్షులు శంకర్ మాగాపు, టిఏజిబి ఛైర్ పర్సన్ ప్రకాష్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ బచ్చు తదితరులు ప్రసంగించారు.
టిఏజిబి-మంత్రి పల్లె
శశికాంత్ వల్లేపల్లి , శ్రీనివాస్ కాకి, సత్య పరకాల, కృష్ణ వెంపటి, చంద్ర తాళ్లూరి, తదితర ప్రముఖులతో సహా పలువురు మంత్రిని అభినందించారు.
టిఏజిబి-మంత్రి పల్లె
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడుతున్న రాజధాని అమరావతి నగరం తెలుగు తల్లికి మణిమకుటముగా నిలుస్తుందని, అఖండ భారతావనికి గర్వకారణమౌతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
టిఏజిబి-మంత్రి పల్లె
అలనాటి శ్రీ కృష్ణదేవరాయల హంపి నగరంలా మన అమరావతి నగరం కూడా శతసహశ్ర శోభలతో వెలుగాలనే ఆకాంక్షతో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
టిఏజిబి-మంత్రి పల్లె
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి లక్షా50వేల ఇటుకలకు విరాళంగా పలువురు దాతలు ముందుకొచ్చారు.
టిఏజిబి-మంత్రి పల్లె
శశికాంత్ వల్లెపల్లి తన మితృులతో కలిసి మరొక లక్షా10 వేల ఇటుకలను అమరావతి రాజధాని నిర్మాణానికి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. 12మంది పారిశ్రామిక వేత్తలు తమ పెట్టుబడులకు, వాణిజ్య సంస్థల స్ఠాపనకు సంసిద్దత వ్యక్తం చేశారు.
టిఏజిబి-మంత్రి పల్లె
ఈ సమావేశానికి కేవలం ఆంధ్రప్రదేశ్ వారే కాకుండా పలువురు తెలంగాణ ప్రవాసులు కూడా రావటం, విరాళాలు ప్రకటించటం హర్షదాయకమని టిఏజిబి ప్రతినిధులు అన్నారు.