ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపిన టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది
టాక్ సంస్థకు ఇస్తున్న ప్రోత్సాహానికి ఎంపీకి పవిత్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లండన్: ఇటీవల లండన్ నుండి సెలవులపై హైదరాబాద్ వచ్చిన టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, ఎంపీ కవిత గారిని కలుసుకొని టాక్ సంస్థకు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లండన్లో బోనాల జాతరను చాలా ఘనంగా నిర్వహించారని, తాను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చూశానని ఈ సందర్బంగా ఎంపీ కవిత పవిత్రతో తెలిపారు. ముఖ్యంగా ప్రవాసులలో చేనేత వస్త్రాల మరియు కార్మికులకు మద్దతుపై అవగాహన కలిగించే కార్యక్రమం బాగుందని ఆమె ప్రశంసించారు.
టాక్ భవిష్యత్తు కార్యక్రమాలన్ని కవిత గారికి వివరించి వారి సూచనలను - సలహాలను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా తీర్చి దిద్దడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేస్తున్న కృషిలో బాగస్వాములమవుతామని, తెలంగాణ నాయకత్వం ఎటువంటి దిశా నిర్దేశం చేసినా అన్ని వేళల ముందుండి పని చేస్తామని పవిత్ర కంది తెలిపారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షురాలు పవిత్ర కంది కుటుంబ సభ్యుల తో పాటు సంస్థ ప్రతినినిధులు - ఎన్నారై టి. ఆర్.యస్ నాయకుడు రాజ్ కుమార్ శానబోయిన పాల్గొన్నవారిలో ఉన్నారు.