టైమ్స్ జాబితాలో తెలుగు కావ్యం : ముగ్గురు భారత సంతతికి స్థానం
అత్యంత ప్రభావశీలురైన యువత జాబితాలో తెలుగు అమ్మాయి స్థానం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అత్యం త ప్రభావశీలురైన యువత జాబితాను టైమ్స్ విడుదల చేసింది. అందులో తెలుగమ్మాయి తో పాటుగా మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. టైమ్స్ విడుదల చేసిన జాబితా తో ఇప్పుడు తెలుగు తేజం..ప్రపంచ వ్యాప్తం గా ఖ్యాతిని చాటింది.
ప్రముఖ పత్రిక టైమ్స్ అత్యంత ప్రభావ శీలురైన యువత జాబితా వెలువరించింది. అందులో తెలుగమ్మాయి.. భారతీ య అమెరికన్ అయిన కావ్య కొప్పరపు స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం అమెరికా లోని హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో కావ్య చదువుకుంటున్నారు. మెదడు కేన్సర్ రోగులకు అందిచే చికిత్సలో సాయపడే విధంగా ఓ కంప్యూటర్ వ్యవస్థ ను కావ్య రూపొందించారు. దీంతో..టైమ్స్ పత్రిక ప్రతిష్ఠాత్మకంగా అందించే ప్రభావ శీలురైన యువత జాబితా లో కావ్య కు స్థానం దక్కంది. మొత్తం 25 మందిని విభిన్న రంగాల్లో ప్రతిభ కనబర్చిన అత్యంత ప్రభావశీలురైన యువత జాబితా ను టైమ్స్ విడుదల చేసింది. 2018 సంవత్సారానికి గాను ఆ సంస్థ ఎంపిక చేసిన జాబితాలో కావ్య తో పాటుగా మరో ఇద్దరు భారత సంతతి విద్యార్ధులకు స్థానం దక్కింది.
తెలుగమ్మాయి కావ్య ప్రస్తుతం భారతీయ అమెరికన్ గా హార్వర్డ్ విశ్వ విధ్యాలయం లో రీసెర్చ్ చేస్తున్నారు. ఇక, మరో ముగ్గురు రిషబ్ జైన, బ్రిటిష్ ఇండియన్ అమికా జార్జి ఈ జాబితా లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు టైమ్స్ విడు దల చేసిన జాబితా తో ప్రపంచ దేశాల్లో భారతీయ సంతతి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.