వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-20

By Staff
|
Google Oneindia TeluguNews

రాజయ్య ఎన్‌కౌంటర్‌లో మరణించాడన్న వార్త. రాంరెడ్డికి ఉద్యమాన్ని నడుస్తుందనే ఆశ కాస్తా నీరుగారిపోయింది. ఆకాశమంతా కారుమబ్బులు కమ్మేసిన భ్రాంతి. కళ్లు బైర్లు కమ్మి నిలదొక్కుకోలేని స్థితి. ఎక్కడా కాలు నిలువడం లేదు. చిటారు కొమ్మను పట్టుకుని వేలాడుతున్న ఆశ కాస్తా నిట్టనిలువునా రాలిపడింది. ఆకాశంలో తోకచుక్క పొడిచిందా? ఈ త్యాగం ముందే రాసి పెట్టి ఉందా? ఈ త్యాగం అవసరమైందా? తాను చెబుతూనే ఉన్నాడు. విన్నట్టే విన్నాడు. ఏ మాయ కమ్మేసిందో, ఎవరు దారి తప్పించారో అడవి దారి పట్టాడు, తుపాకి గొట్టమన్నాడు. ఆ సంఘటన నిన్న మొన్ననే జరిగినట్లుంది.

డాక్యుమెంటు రాయడానికి ఇంగ్లీష్‌ వ్యాసాలు తెలుగులోకి అనువాదం చేసిమ్మని వచ్చాడు. కళ్లలో ఏదో తేజస్సు. ఒక కొత్త దారి తీస్తున్నామనే వెలుగు ముఖంలో కనిపిస్తోంది.

''మేం కచ్చితంగానే ఉన్నాం'' అన్నాడు.

''ఏ విషయాల మీద కచ్చితమనేది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు దారి తప్పామో మళ్లీ ఉద్యమం నిర్మించడం సాధ్యం కాదు'' అన్నాడు రాంరెడ్డి.

''ఏమిటవి?''

''నువ్వే పార్టీలోనైతే చీలిక తెచ్చావో ఆ పార్టీకి సమాధానం ఇచ్చే పద్ధతిలో డాక్యుమెంట్‌ ఉండకూడదు. కేవలం మంచీచెడులు మాత్రమే చర్చించాలి. ఆ చర్చ చేస్తూ ఏ మార్గం దరి చేస్తుందో చెప్పి ఒప్పించాలి. ఎవరి ఒప్పించాలనేది కూడా కచ్చితంగా నిర్ణయించుకోవాలి. నువ్వు ఎవరి కోసమైతే ఉద్యమం నిర్మిస్తున్నావో వారిని ఒప్పించాలి. నీ మాతృసంస్థను ఒప్పించే ప్రయత్నం చేస్తే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే అవుతుంది'' మాటలు ఇవే కాకపోయినా ఉద్వేగం మాత్రం అదే. గొంతులోతుల్లోంచి తానే ఆశ్చర్యపడేలా మాటల మూటలు రాలిపడుతున్నాయి రాంరెడ్డి నోటి నుంచి. ''నువ్వు ఇప్పుడున్న విప్లవ పార్టీలకు వేటికీ సమాధానం ఇవ్వక్కర్లేదు. నీదంతా కొత్తదనే పద్ధతిలో ఉండాలి'' అన్నాడు.

రాజయ్య శ్రద్ధగా వింటున్నాడు. ఆయన మనసులో ఏదైనా రూపుకడుతుందో లేదో గానీ రాంరెడ్డికి మాత్రం కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నది. ''ఇది సాయుధ పోరాట దశ కాదనే విషయం గుర్తుంచుకో. అయితే రహస్య పార్టీ నిర్మాణం వదిలిపెట్టమని నేను చెప్పడం లేదు. కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వద్దు. అది ఉందనే విషయం బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. పార్టీ నిర్మాణమంతా ప్రజలను కదిలించే పద్ధతిలో ఉండాలి. పార్టీ పేరులో కమ్యూనిస్టు వాసనలు అక్కర్లేదు. సాధ్యమైనంత లోకలైజ్‌ చేస్తూ, దళితులను రిప్రజెంట్‌ చేసే పద్ధతిలో పేరు ఉండాలి'' అన్నాడు రాంరెడ్డి.

ఈ సంభాషణంతా విన్న రాజయ్య సంతృప్తిగానే వెళ్లిపోయాడనిపించింది. ఏమైందో గానీ ఆ తర్వాత ఏ రోజూ తనను కలవలేదు. కానీ పార్టీ మాత్రం పుట్టింది, నడుస్తూనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X