ముఖ చిత్రాలు
(రచనావ్యాసంగాన్ని సీరియస్గా తీసుకునే రచయితలు చాలా వరకు తెర ముందుకు రావడానికి ఇష్టపడరు. రూబెన్ చాలా కాలంగా హిందీ కథలను తెలుగులోనికి అనువదిస్తున్నారు. అయినా ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ. ఈ మధ్య ఆయన 'రెక్కలు' పేరుతో అనువాద కథల సంకలనం వెలువరించారు. హిందీ కథల మాధుర్యం తెలిసిన వారికి మిగతా భాషల కథలు అంతగా రుచించవు. వాటి గొప్పతనం అది. అనువాదంలో కూడా ఆ మాధుర్యాన్ని తెచ్చి పెట్టారు కిన్నెర రూబెన్. ఈ కథలపై ప్రముఖ తెలుగు కథా రచయిత డాక్టర్ వి. చంద్రశేఖరరావు ఆ పుస్తకానికి ముందుమాటగా రాసిన వ్యాసం అందిస్తున్నాం.)
సౌందర్యాన్ని
చిదిపివేసిన
తర్వాత-
కలతబారిన
సాయంకాలాల
చూర్లలో
గుత్తులు
వేలాడే
ముఖాలు-
ముఖాల్నిటు
తిప్పి-
హత్య
కనబడదు-
యుద్ధం,
విధ్వంసం
మాత్రం
ముఖాల
నిండా-
రెక్కలు
కథలోని
'నాయిక'లా-
దుఃఖానికొక
మరణపు
తొడుగు
వేసి-
అనగనగా
నాటకం-
తెర
ఎత్తి-
రంగస్థలాన్ని
చూద్దాం!
అక్కడా
ఛిద్రమైన
ముఖచిత్రాలే!
శకుంతల,
దుష్యంతుడు,
కణ్వుడు-
'శకుంతలను
దుష్యంతుడు
మరిచిపోడానికి
వీల్లేదంటూ'
ఆడియన్స్
నినాదాలు
చెయ్యటం-
మనకు
నవ్వు
రాబోతుంది-
అక్కడా
ఒక
దుఃఖ
ముఖచిత్రం-
ఆకలి
ముఖ
చిత్రం-
మరో
ముఖచిత్రం-
బెంగాల్
కరువు
'ఆకలి
రంగు
నలుపు'
కథలో
లాగా-
ఆకలి,
మరణం-
శవం
ముఖంపై
చర్మాన్ని
పీకి-
హిందువా,
ముస్లిమా-
అని
పోలికలు
వెతికే-
మతం
మన
ముఖాల
చుట్టూ
దట్టమైన
చర్మపు
ముఖ
కవచాన్ని
కప్పుతూ-
ఒక
ముఖచిత్రం-
'గృహోన్ముఖంగా'
కథలోలాగా-
మానవ
సంబంధాల
విధ్వంసం
గురించి
చెబుతుంది.
'నేను',
'నా
సుఖం'
అనే
మంత్రం
మనకు
ప్రియమవటం-
రిటైర్
అయి
ఇంటికి
వచ్చిన
ఆసామి-
పారేసిన
చెక్క
మంచంలా-
ఒకళ్ల
ముఖాలు
మరొకరు
మార్చుకుంటూ-
గారడీ
వాడి
బుట్టలో
లాగా-
మన
ముఖాలన్నీ
మారిపోయి-
వాడి
ముఖం
వీడికి,
వీడి
ముఖం
ఇంకొకడికి-
పాత
శరీరాలకు
కొత్త
ముఖాల్లా-
ఈ
కథలు
ముప్పయి
ఏళ్లనాటివి.
హిందీలో
రాసినవి!
అయితే
ఆశ్చర్యం-
ఇవాల్టి
కథల్లాగే-
తెలుగులో
ఇప్పుడొస్తున్న
గొప్ప
కథల్లాగే-
ఉండటము....బహుశా
అంతటా
ఇదే
జీవితం-
ఇదే
గారడీ-
ఎవడో
మన
ముఖాల్ని
మార్చి
వేస్తున్నాడు.
ఒక ముఖం మనల్ని చూసి నవ్వుతుంది. ఆ నవ్వులో జీవం వుండదు. జేబులో కత్తులు దాచుకొన్న హంతకుడు- కత్తి విసిరే ముందు- నవ్వు విసుర్తాడు- గాయపడ్డ మనిషి ముందు కూలబడి ఆకాశం వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు- కత్తిని శుభ్రంగా కడిగి- ముమ్మారు కళ్లకు అద్దుకొని- తన పేరు నేలపై రాసి వెళతాడు- శవం చుట్టూ మూగిన మనకు నేలపై 'భగవంతుడు' అనే అక్షరాలు వెక్కిరిస్తూ కనబడతాయి.
'చావు విందు' కథ చదివాక- ఆ కథ మనల్ని చూసి అట్లా వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరో ముఖచిత్రం- సాయంకాలపు శీతస్పర్శ- ఒక వాసన- మనుషులు కుళ్లుతున్న వాసన- శరీరాల్లో మరణం లాంటిదేదో ప్రవేశించి- మనిషి చావడు- కానీ మరణం మన అనుభూతిలోకి వస్తుంది.
కవులు, కథకులు అబద్ధాలు చెప్పరు- నిజాలే చెబుతారు. అమ్మకాలు, బేరాలు సాగే 'మార్కెట్టు' లాగా మన జీవితాలు మారిపోయిన నిజాన్ని- అప్రియమైనా- తీతువు పిట్టలాగా కూస్తారు. ప్రమాద సంకేతాన్ని పాడే 'రుంజ' గాయకుల్లా- వాళ్లట్లా హెచ్చరిస్తుంటారు- అదొక బాధ్యత- బహుశా అదొక అబ్సెషన్ కూడా అయి వుంటుంది. కథలు రాసి, లేదా అనువాదం చేసి-
ఈ
కథలు
చెప్పే
తీరాలి-
బహుశా
ఇప్పుడే,
ఈ
రాత్రే-
అట్లాంటి
కంపల్సన్లోంచి
వచ్చిన
కథలు
ఇవి!
సమాజంపనై
తనకున్న
బాధ్యత
ఈ
కథలన్నిటిలో
కనిపిస్తుంది.
రూబెన్
వృత్తిరీత్యా
ఉపాధ్యాయులు-
అదొక
పవిత్ర
బాధ్యత
ఆయనకు.
సమాజానికి
కథలు
చెప్పి,
ముఖచిత్రాలు
వెలికి
తీసి,
ప్రదర్శించి-
ఈ
కథలన్నిటిలోను
అధ్యాపకుడి
ఓర్పు,
నేర్పు
కనిపిస్తాయి.
కథల
నిండా
వెచ్చని
ఊపిరులు-
గొప్ప
జీవితం.
ఈ
కథా
ముఖచిత్రాలు
అవి
దుఃఖిస్తాయి.
దుఃఖాన్ని
మన
లోపల
ప్రవేశపెట్టి-
మనల్ని
మెలిపెట్టి,
మరపట్టి,
మన
లోతైన
డొల్లలోకి
ప్రవేశపెట్టి-
దుఃఖం
సౌందర్యంగా
పరివర్తనం
చెందటం
ఈ
కథల్లో
చూస్తాము-
దుఃఖం
వికసించే
దేహాలుగా
మారటం
ఈ
కథల్లో
మనం
చూస్తాము-
ఈ
కథల్ని
చదివి-
గుట్టలు,
గుట్టలుగా
పడి
వున్న
ముఖాల్ని
ఒక్కొక్కటే
ఏరుకొని,
ఇది
నీదా,
ఇది
నాదా,
ఈమెదా
అంటూ
పోలిక
వెతుక్కునే
గమ్మత్తయిన
ఆట
కోసం
ఈ
కథల్ని
చదువుదాం!