మరుపురాని లోకసంచారికి నివాళి
ఆ ప్రతిస్పందనలను ఒక దగ్గర చేర్చి జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో రామయ్య విద్యా పీఠం మరుపురాని లోకసంచారి పేర ఒక పుస్తంగా వెలువరించింది. బాలగోపాల్ పై నివాళి వ్యాసాలను ఆ రకంగా తెలుగు సమాజానికి అందించింది. ఈ వ్యాసాల్లో బాలగోపాల్ వ్యక్తిత్వం, కార్యశీలత, సృజనశీలత, బౌద్ధిక ప్రపంచం వ్యక్తమైంది. పలు కోణాల నుంచి వారి వారి అనుభవాలను వ్యాసకర్తలు తమదైన పద్ధతిలో రాశారు. సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా తెలుగు సమాజం ప్రతిస్పందించిన తీరు ఈ వ్యాసాల్లో వ్యక్తమైంది. అన్నింటికన్నా బాలగోపాలో ఒక మానవుడు అనే విషయాన్ని ఈ వ్యాసాలు పట్టిస్తాయి.
వరవరరావు, హరగోపాల్, ఎం.కోదండరామ్, వేల్చేరు నారాయణరావు, కత్తి పద్మారావు వంటివారు రాసిన నివాళి వ్యాసాలతో పాటు పలువురి వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. గతంలో కెఎన్ వై పతంజలి బాలగోపాల్ పై రాసిన ప్రశంసాత్మక వ్యాసం కూడా ఇందులో ఉంది. దానికి తోడు, బాలగోపాల్ రాసిన కొన్ని సాహిత్య వ్యాసాలను మచ్చుకు ఇందులో చేర్చారు. సాహిత్యంపై కె. శ్రీనివాస్ చేసిన బాలగోపాల్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఈ పుస్తకంలోని నివాళి వ్యాసాలు చదివితే మానవ మనుగడకు అర్థం చెబుతూ బాలగోపాల్ నడుచుకున్నతీరు, ఆలోచించిన వైనం మనకు బోధపడుతుంది.
(మరుపురాని లోకసంచారి, సం. జూలూరు గౌరీశంకర్, వెల: రూ. 50, ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని పుస్తకాల షాపులు)