తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు చోట్లా కష్టమేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఎవరి మద్దతు లేకుండా సొంత బలంతోనే అధికారంలోకి వస్తానంటున్నారు చిరంజీవి. కానీ ఆయన స్వయంగా పోటీ చేస్తున్న తిరుపతి, పాలకొల్లు స్ధానాల్లో ఆయన గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నట్టు క్షేత్ర స్ధాయి నుంచి వార్తలు వస్తున్నాయి. తిరుపతి స్ధానంలో ఆయన దాదాపు ఎదురీదుతున్నట్టే లెక్క. ఈరెండు స్ధానాల్లో ఆయనను ఓడించాలని కాంగ్రెస్, మహాకూటమి అగ్ర నాయకులు కంకణం కట్టుకుని వ్యూహాలను అమలు చేస్తున్నారు. తిరుపతిలో లోకల్-నాన్ లోకల్ ఫీలింగ్ ను కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్ధులు తీసుకురావడంతో చిరుకు గడ్డు పరిస్ధితి ఏర్పడింది. తామైతే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతామని, చిరంజీవి ఎమ్మెల్యే అయితే స్ధానికులకు అందుబాటులో ఉండరని వీరు చేస్తున్న ప్రచారం పనిచేస్తున్నట్టే కనిపిస్తోంది.

చిరంజీవి ఆదివారం నాడు మీడియా ముందు చేసిన ప్రకటనలను బట్టి ఆయన గెలుపుపై ఎంత ఆందోళన చెందుతున్నారో స్పష్టమవుతోంది. తిరుపతిలో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని, వీటిని తొలగించాలని ఎన్నికల కమిషన్ ను కోరనున్నట్టు చిరంజీవి చెప్పారు. తిరుపతిలో తనను ఓడించేందుకు కడప, పులివెందుల నుంచి కాంగ్రెస్ పార్టీ గూండాలను దించిందని చిరంజీవి ఆరోపించారు. దీనికి తోడు చేగొండి హరిరామ జోగయ్య చేసిన దూలగొండి ప్రకటన చిరంజీవి మరింత ఇబ్బందుల్లో పడేసింది. రెండు స్ధానాల నుంచి చిరంజీవి గెలిచినా పాలకొల్లు స్ధానాన్ని ఉంచుకుని తిరుపతి స్ధానానికి పోటీ చేస్తారని ఆయన పదే పదే ప్రకటించడం వల్ల చిరును గెలిపించుకుని లాభమేమిటని తిరుపతి ఓటర్లు అనుకునే పరిస్ధితి ఏర్పడింది.

చిరంజీవి ఏ స్ధానం ఉంచుకుంటారన్నది ఇంకా నిర్ణయించుకోలేదని అల్లు అరవింద్ ప్రకటించినా, తిరుపతి ఓటర్లలో అనుమానాలు పోవడం లేదు. పాలకొల్లులో పరిస్ధితి మరో విధంగా ఉంది. ఇక్కడ ఎస్ సి, బిసి ఓట్లు అత్యధికంగా ఉన్నాయి.సంప్రదాయ సిద్ధంగా ఎస్ సిలు కాంగ్రెస్ కు, బీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తూ వస్తున్నారు. ఈసారీ అదే జరిగితే చిరు గెలుపు చాలా కష్టమైపోతుందని స్ధానిక పీఆర్పీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X