వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
2011 ప్రపంచకప్ పై ప్రభావం!
లాహోర్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని భారత విదేశాంగ సహాయమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. ఆ ఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్ పంపించలేదని ఆయన తెలిపారు. పాకిస్థాన్లో ఉగ్రవాదులు ఏస్థాయిలో పేరుకుపోయారో ఈ సంఘటన తెలపుతుందని ఆయన అన్నారు. పాక్ ప్రభుత్వం మేల్కోని ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని ఆనంద్శర్మ సలహా ఇచ్చారు.
Comments
Story first published: Tuesday, March 3, 2009, 17:40 [IST]