పక్షులకూ 'ఐశ్వర్యం'
ప్రస్తుతం లవ్ బర్డ్స్ పేరుతో పక్షుల అమ్మకాలు ఎక్కువై క్రమంగా పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల పక్షుల కొనుగోళ్లు, అమ్మకాలు చేయరాదని ప్రజలకు వివరించేందుకు ఈ ఐష్, బచ్చన్లను పెటా ఎంపిక చేసింది. గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం చేపట్టారు. ఎలాగైనా లవ్ బర్డ్స్ ను రక్షించాలని దీనికి ప్రజలందరూ సహకరించాలని పెటా ప్రతినిధి అనూరాధా సాహ్నే పేర్కొన్నారు.
పక్షులను అక్రమంగా బోనులలో బంధించినవారిని జంతు సంరక్షణ చట్టం కింద శిక్షించాలని ఆమె డిమాండ్చేశారు. అంతరించిపోయే జీవజాతులపై అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందంలో విదేశీ పక్షుల విక్రయాలకు పరిమితులు విధించారు. అంతేకాకుండా 300 దేశాలకు చెందిన 1200 పక్షుల జాతులు బ్లాక్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. ఈ లవ్బర్డ్స్ సాధారణంగా అమ్ముడుపోతుంటాయి. అయితే వీటి సంరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. దీనిపై నటులు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ లతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పెటా శ్రీకారం చుట్టిందని అనురాధా వివరించారు.