మహిళలకు ప్రాధాన్యం
ఇందులో సివిల్ విభా గం పోస్టులు 70శాతం ఉండగా మిగతావి సాయుధ బలగానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఈ పోస్టుల్లో ఒక్క హైదరా బాద్లోనే ఐదు వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఈ లెక్కన నగర పోలీసు విభాగం భర్తీలో 250మంది మహి ళలు నియమితులు కానున్నారు. ఇటీవల జరిగిన భర్తీల్లో ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం విశేషం. సిటీ పోలీసు విభాగంలో ఇప్పుడున్న పోలీ సులతో కలిపితే వీరి సంఖ్య ఐదు వందలు దాటు తుంది. హోంగార్డు లతో కలిపితే ఈ సంఖ్య వెయ్యి వరకు చేరుతుంది. హైదరాబాద్తోపాటు సైబరాబా ద్, విజయవాడ, విశాఖపట్నంకమిషనరేట్లలోనూ మహిళా పోలీసుల సంఖ్యను పెంచాలని సర్కారు నిర్ణయించింది.
సివిల్ విభాగంలో జరిగే భర్తీల విషయం అలా వుంచితే సాయుధ బలగంలోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని హోంశాఖ చేసిన ప్రతి పాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా పోలీసు విభాగాలకు అనుబంధంగా వుండే సాయుధ బలగాలతోపాటు ఏపీఎస్ పీ విభాగంలోనూ మహిళలకు ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సాయుధ బలగం (రిజర్వ్ పోలీసు విభాగం)లోనే మహిళలకు కొంత వర కు ప్రాధా న్యం వుంది. దీనిని మరికొంత పెంచాలని సర్కారు నిర్ణయించింది. దీంతోపాటు ఎపీఎస్ిపీ లోనూ మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. తమిళనాడు తరహాలో మహిళా బెటాలి యన్ను ఏర్పాటు చేసే అంశాన్ని సర్కారు తీవ్రంగా పరిశీలిస్తోంది.