హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు పార్టీకి పవార్ ఆఫర్

By Staff
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
హైదరాబాద్‌: ఉమ్మడి గుర్తు వచ్చే అవకాశం లేని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చాలా మందికి లోకువగా మారింది. ప్రజారాజ్యానికి ఎన్నికల సంఘం ఒకే ఎన్నికల గుర్తు కేటాయించే అవకాశాలు లేని అంశాన్ని ఎన్ సిపి అధినేత, కేంద్రమంత్రి శరద్‌ పవార్‌ తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేస్తున్నారు. కావాలంటే ప్రజారాజ్యం పార్టీ తమ ఎన్నికల గుర్తు(గడియారం)పై పోటీ చేయవచ్చని ఒక భారీ ఆఫర్‌ ఇచ్చారు.

కేంద్ర వ్యవసాయ మంత్రిగా, ఎన్‌సిపి అధినేతగా, యుపిఎ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న శరద్‌ పవార్‌ కేంద్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే ఈ నిర్ణయం తీసుకోవడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తున్నది. కాంగ్రెస్‌ను దునుమాడుతున్న చిరంజీవికి మద్దతు ఇవ్వడం ద్వారా శరద్‌పవార్‌ ఆశిస్తున్నదేమిటో ఓ అంతుచిక్కని ప్రశ్న. రాజకీయ దురంధరుడిగా పేరున్న పవార్ కు ప్రధాన మంత్రి పదవిపై ఎప్పటినుంచో కన్ను ఉంది.

కాగా, అసలు ప్రజారాజ్యం పార్టీకి ఎన్‌సిపి ఎన్నికల గుర్తు ఇస్తే ఏం జరుగుతుంది? అసలు ఇలా ఒక పార్టీ వాళ్ళు మరో పార్టీకి ఎన్నికల గుర్తును అప్పుగా ఇస్తారా? లాంటి ప్రశ్నాస్త్రాలతో విపక్షాలు ఎదురుదాడికి సిద్ధమవుతోన్నాయి. ఏది ఏమైనా శరద్‌ పవార్‌ వ్యవహారశైలి రానున్న ఎన్నికల పొత్తులపై ప్రభావం చూపనున్న మాట మాత్రం సుస్పష్టం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X